కనువిప్పు

కనువిప్పు

రచన :: దాస్యం కవిత

ఒక ఊరిలో భార్య భర్తలు ఉంటారు భర్త బద్దకస్తుడు. భార్య చాలా తెలివిమంతురాలు. భార్య చెప్పిన మాటను పెడచెవిన పెడుతూ బద్దకంగా కాలం వెళ్లదీస్తూ ఖాళీగా ఉంటాడు. ఏదైనా కష్టపడకుండా రావాలన్న ధోరణి అతనిది. ఒకరోజు ఊర్లో స్వామీజీ వచ్చాడని తెలుసుకొని అతనిని విందుకు ఇంటికి ఆహ్వానించి తన పెరట్లో ఏమైనా లంకెబిందెలు దొరుకుతాయేమో తెలుసుకొని జీవనం సాగించవచ్చు అనుకొని భార్యతో రకరకాల పిండివంటలు సిద్దం చేయి స్వామి భోజనానికి వస్తారు అని చెప్పి స్వామికి ఆహ్వానం పలుకుతాడు. అతను శిష్యులతో ఇంటికి వస్తాడు. భార్య, శిష్యులకు రకరకాల పిండివంటలతో వడ్డించి స్వామీజీకి మాత్రం తెల్ల అన్నంతో సరి పుచ్చుతుంది. అది చూసి భర్త చివాట్లు పెడతాడు. ఇది గమనించిన స్వామిజి లేచి వెళతాడు. భర్త కోపోద్రిక్తుడై ఏంటి నువ్వు చేసిన పని అదృష్టాన్ని నువ్వే ఆపుతున్నావే అనగా తెలివిగల భార్య ఒకసారి మీరే చూడండి విస్తరాకులో అన్నము కింద అన్నీ వడ్డించాను ఇక్కడే స్వామీజీ దూరదృష్టి తెలిసిపోయింది నిన్ను ఏం ఉద్ధరిస్తాడు అని చెప్తుంది. భర్తకి కూడా ఇదంతా చూసి కనువిప్పు కలుగుతుంది. మంత్రాలకు చింతకాయలు రాలవు. ఏదైనా కష్టే ఫలి అన్నట్టు కష్టంతో సాధించుకోవాలి అని ఆ రోజు నుంచి పనిలో కుదురుతాడు.

నీతి :కష్టపడనిది ఏది దొరకదు, దొరికిన ఎక్కువ రోజులు నిలవదు! బద్ధకస్తులు అందరికీ మంచి గుణపాఠం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!