నాకు దెయ్యం పట్టింది
(కథా సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు: బాలపద్మం
కథ: నాకు దెయ్యం పట్టింది
కథారచయిత: కార్తిక్ నిమ్మగడ్డ
చాలా బాగా హృదయ స్పందన అక్షరాలలో కుదించారు. కథలో చెప్పినట్టు ఎక్కువ శాతం మహిళలు ఎదుర్కుంటున్న ప్రతి సమస్యను కదిలించారు.
నిజమే ఈ సమాజం మారేదెప్పుడు? ప్రతి అక్షరం వెనుక ఒక స్త్రీ గా ఆలోచించి వ్రాసిన విధానం హర్షణీయం. మీకు శతకోటి వందనాలు.
సమాజంలో స్త్రీని దేవత అని, సృష్టి చేయగల బ్రహ్మ కి మారు రూపం అని కొనియాడే నేటి సమాజం ఎందుకు ఆవిడని మాట్లాడే హక్కు కూడా లేకుండా చేస్తోంది… సూటిగా ప్రశ్నించారు.
ప్రతీ మగాడే కాదు ఇంట్లో ఉండే అమ్మ, అమ్మమ్మ, అత్త, నానమ్మ కూడా సమాధానం చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతం సర్. మీరు ఓ శీర్షిక పెట్టమంటే నేను పెట్టేది… కట్టుబాట్ల సంకెళ్లు – స్త్రీకి శాపాలా?
nice
nice
nice comment
super. Nice one
కథ అద్భుతం. అందుకు తగ్గ సమీక్ష