నీలో నన్ను చూశా

నీలో నన్ను చూశా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : సరిత రవిప్రకాష్

వర్షం వెలిసిన తరువాత
చిరుగాలిలో
నీ నవ్వును
నేను చూశాను…
హరివిల్లు వచ్చినప్పుడు
రంగులు అన్నీ
కలిసి ఒకే సారి కనపడినప్పుడు
నేను నిన్ను చూశాను..
మౌనమే మాటలుగా
నాతో నేనే వాదించుకున్నపుడు
నా మనసులో నీవు కూర్చొని నాకోసం తీర్పిచ్చినప్పుడు
వాదనలో గెలిచేది
నేనే అని మురిసిపోయినప్పుడునాలో నిన్ను చూశాను.
నీ మాటలే యుగళ గీతంగా నాలోని అలలే తాళంగా,
నా ధ్వనిలో నీవు గానం పాడినప్పుడు,
ఆ సుమధుర గీతం నేనని అనుకున్నా..
నాలో నిన్ను చూశా
ఎందుకో, ఏమో ఎప్పుడు వాన నిలిచి హరివిల్లు రాగానే
నీవే వచ్చావు అనిపించేది…
నీతో చెప్పాలనుకునే మాటలన్నీ
మౌనంగా మారి నాలోనే నిలిచేవి,
గాలి,అలలు ఎన్ని వచ్చినా నీవు నాకు మరుపుకావు
నీవే నా గురి అని
నాకు తెలుసు.
నీతో అడుగులో అడుగు వేసి
నీ అడుగులో అడుగునై నేను  మురిసి పోయాను
ఇప్పుడు కూడా నిన్ను చూశా నిన్ను చూశా
నీవు నా తోడుగా ఉన్నావని అనుకుంటూ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!