రాధ మది

రాధ మది

బృందావనం లో నీ ముందు గోపికలు ఎంతమంది ఉన్నా

నీ అలౌకికమైన ఆనందమంతయూ నాతోనే గదా కృష్ణ 

నీతో పంచుకునే భావనలు 

నీకై చూసే ఎదురు చూపులు

అన్నీ మధురమే  

నీవు వినిపించే వేణు గానానికి మురిసిపోయే బృందావనం

బలరాముడు వెంట రాగా రాక్షసాధములను 

అంతమొందించ మధురకేగితివే 

ద్వారకను నిర్మించి లోకోద్ధరణ చేయుచూ 

ఈ రాధను మరిచితివా కృష్ణ 

నిను చూడక  నా మనసు నిలువకున్నదాయె 

గడిచిన కాలాన నీ నామ స్మరణమే  నా జీవనమాయే కృష్ణ 

జీవన చదరంగం లో చిక్కుకుని నిను మరిచినానని భ్రమ పడకుమా 

నిను నా మది లో ధ్యానిస్తూ నిను వీక్షించె ఘడియ కై 

క్షణాలు యుగాలు గా గడుపుతున్నాను కృష్ణ 

నిను నా కనులారా గాంచుటకై నీ సన్నిధి కి నే వస్తున్నాను కృష్ణ 

రాధ ద్వారక చేరుకుని  

తన సఖుడు తన ప్రాణం 

తన ధ్యానం తన జీవం అయిన  

శ్రీ కృష్ణుడి ముగ్ధ మనోహర రూపాన్ని గాంచిన రాధ  

అలా ఆ మాధవుడిని చూస్తూనే తనలో ఐక్యం చెందుతుంది.

                              రచన – గాయత్రి భవ్య

You May Also Like

One thought on “రాధ మది

  1. చాలా చాలా బాగుంది అండి. రాధ కృష్ణుల ప్రేమ అంత మధురంగా ఉంది.👌👌👏🏻🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!