డబ్బు మూట (బాల సాహిత్యం)
రచన : ఐశ్వర్య రెడ్డి గంట
రాఘవయ్య చాలా మంచివాడు, కాని పేదవాడు ఉన్నంతలో జీవితం గడిపేవాడు తన భార్య పిల్లలతో.
ఒకరోజు రాఘవయ్య తన ఊరికి దగ్గరలో ఉన్న తన స్నేహితుడి కి ఆరోగ్యం బాగా లేకపోతే చూసి వస్తుండగా చీకటి పడింది.
అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళితే తొందరగా వెళ్లిపోతానని నడక మొదలు పెట్టాడు రాత్రి కావడంవల్ల నక్కల ఊళలు వినిపిస్తున్నాయి, వెన్నెల వెలుగులో దారి కనిపిస్తుంది .
అదేసమయంలో దారి మధ్యలో ఒక మూట లాగా కనిపించింది,చూట్టూ ఎవరు లేరు దాన్ని భయం భయం గానే చేతిలోకితీసుకుని అది డబ్బు మూట అని గుర్తించాడు. తన పూరిగుడిసెకి చేరుకున్నాడు రాఘవయ్య దానిని ముట్టు కోకుండా అలాగే ఒక మూలన పెట్టాడు ఇంట్లో, బార్యతో కాడా ముట్టుకోవద్దని చెప్పాడు. ఎందుకంటే పరుల సొమ్ము పాము వంటిది అని నమ్ముతాడు రాఘవయ్య.
ఒక రోజు ఆ ఊరికి సాధువు వచ్చాడని తెలుసుకొని ఆ డబ్బులమూట ఎవరిదో కొనుక్కోని వారికి అందజేయాలని సాదువు దగ్గరికి వెళ్ళాడు , సాధువుతో జరిగిన విషయమంతా చెప్పగా సాధువు దివ్య దృష్టి తో చూసి ఈ డబ్బు మహారాణి సుమిత్రాదేవిది ఆమె ఈ డబ్బుమూటను పేదవారికి పంచడానికి వస్తుండగా కాకుల గుంపు దారిలోఅడ్డు గా ఉండటంతో అపశకునంగా బావించి ఇంటికి తిరిగి వెళుతుంటే ఆ విషయం తెలుసుకున్న దోపిడీ దొంగలు వారి మీద దాడి చేసి మూట ను ఎత్తుకెళ్లారు. తరువాత దోంగలను పట్టుకున్నారు కాని ఈ మూట వారికి దొరకలేదు. ఇప్పుడు నీకు దొరికింది. వారు ఇప్పుడు ఊరికి ఉత్తరం వైపు దుర్గాలయం నిర్మించే పనిలో ఉన్నారు.
నువ్వు వెళ్లి ఆమెకు డబ్బు ముట్టచెప్పు నీ నిజాయితీ కి తగిన ప్రతి పలం దక్కుతుంది అని చెప్పగానే రాఘవయ్య వెళ్లి మూట ను అప్ప చెప్పచేప్పాడు. ఆవిడ సంతోషంతో తీసుకొని అతనిని మెచ్చుకోని చాలా బహుమతులు ఇచ్చి రాఘవయ్య కు తన కోట లోనే ఒక కొలువు ఏర్పాటు చేసింది. రాఘవయ్య సంతోషంగా జీవించాడు ఆ కోటలో తన కుటుంబంతో.