అంశం: నిశి రాతిరి
చీకటి మాటున నిశాచరులై
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఆచార్య అయ్యల సోమయాజుల ప్రసాద్
శాంతి, అహింసలే ఆయుధాలుగా
అర్ధరాత్రి స్వాతంత్ర్య సముపార్జన చేసిన జాతిపిత అన్న
స్త్రీలు అర్ధరాత్రి ఒంటరిగా
నడి వీధిలో తిరినప్పుడే అసలయిన స్వాతంత్రం
నేటికి ఎండమావులే కదా
నేటి సమాజంలో ప్లబ్ ల చుట్టు
నిశిరాతిరిలో వ్యసనాలకు బానిసలై
నైతిక విలువలు కోల్పోతున్న యువత నిర్వీర్యులైన పరిస్థితులు
సమజాభివృద్ధికి అవరోధకాలు.
అకృత్యాలు, అరాచకత్వాలకు
నిలయంగా మారుతున్న అర్ధరాత్రి సంఘటనలకు సమాధి కడదాం.
మహాత్ముని కలలు కన్న రామరాజ్యానికి పునాదులు వేద్దాం.
వసుధైక కుటుంబానికే
భరతావని ఆదర్శమని నిరూపిద్దాం……!!