నవోదయం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పద్మావతి పి
వీడ్కోలు పలుకుదాం
అస్తమించే ఉదయానికి
తెగిన గాలిపటంలా
గుండెలనిండా మండే బాధలు.
స్వచ్చ భారత్ లో అణువణువూ
కోరలు చాచిన కాలుష్యం
స్వేచ్ఛా భారతమంటూ
ఆటోలపై- వీధి చాయ్ వాలాలపై జి యస్ టి బిల్లులు
ప్రజారాజ్యం లో పార్టీల దంధాలూ
పార్టీ ల లుకలుకలూ
యథా రాజా తథా ప్రజ లై పోయిన
రౌడీల గూండాయిజాలూ
పదవీ ఆధిపత్యాలకై వోటుకి
నోట్లతో కుయుక్తులూ..
కుల మత వర్గ విభేదాలు
విచక్షణ లే మరిచిన దౌర్జన్యాలు
అంతం లేని అత్యాచారాలు
కపటంతో స్వార్ధంతో నిండిన
అంతరంగాలు
విలువలనే చేజార్చిన వ్యక్తిత్వం
స్వార్ధం, మోసం, కుత్సితంతో కూడిన అంతరంగం
శీలం,సాత్వికతలే మరిచిన సత్శీల సాంగత్యం
ధనం మూలం ఇదం జగత్ గా
మారిందీ మానసం..
శ్రమించి పండించిన రైతన్నకు
ఆకలి దప్పుల ఆత్మహత్యలు
దుశ్శాసన రాజ్యంలో భూముల కబ్జాలు
మాయలూ మంత్రాల పరిహారాలంటూ
బాబాల డబ్బుల పబ్బులు..
సామాజిక జీవన అభ్యుదయం
ఆర్ధిక వ్యవస్థల చదరంగం
రాజరికం నీతికే నీళ్ళొదిలిన ఆథ్యాత్మికం
నలిగిన అణగారిన బతుకుల్లో చిచ్చులు
పెట్టే అవకాశం ఉంది కదా ..
చిలుకలు చెప్పే చిలుకల పలుకులు
భవితకు వేసే బంగరు బాటలు
కూడాబైకుల రైడింగులు జల్సాలు..
ప్రాణానికి రక్షణయే లేని వైభాగలు
ఇది మన భారతం
సంస్కృతీ సంప్రదాయాల స్వరూపం
వేద వేదాంగాల సారం
మేరా భారత్ మహాన్
కొడదాం కోతల చప్పట్లు
చేతలలో చూపని కార్యశూరులూ…
అన్నీ మరుద్దాం మారుద్దాం
మత్తు లో, మైకంలో తూలదాం
చివరికి మిగిలేది శూన్యం
వదిలేద్దాం ఈ ఒక్క రోజైనా
సన్యాసం…