నాంది
రచయిత :: అశ్విని’సంకేత్’
ఎక్కడికి వెళ్తుంది విజ్ఞానం, ఏమై పోతుంది పరిజ్ఞానం…
అంగములన్నీ అవసరం అయినట్టు పంచభూతాలన్నీ అవసరం.మరి ఎందులకు ఆ బేధభావం,ఎలా ఎక్కువయ్యింది ఆకసం…
పుడమి తల్లి రోదిస్తుంది,పుట్టుకకు కారణం అయిన నన్ను తొక్కి పుర వీధులకు ఎగురుతున్నందుకు…
ఆకలి తీర్చునది వదిలి,అందని దాని కోసం ఆకాశానికి నిచ్చెనలు ఎందుకు…
బంధాలు వదిలి బంధనాలు చేరి,బాహువులను చాపి ఆకసానికి ఏగి కనుల మరుగు అవడం దేనికి…
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా, పుడమిని ఉద్ధరించి ఆకాశానికి నిచ్చెన వేయండి…
ఊహాల్లోన బ్రతికి,ఉహాల్లోన చితికి,ఊహాలకే అందకుండా పోయేలా ఎందులకు మనకి ఈ ఆకాశానికి నిచ్చేనవేయడం…
వాస్తవాన్ని నమ్ము,ఒంటి కష్టం చేయు,వెడలి తైలంబు తియ్యవచ్చు పుడమి నుండి.విప్లవానికి అవ్వవచ్చు నువ్వే నాంది…