అక్షరం!
రచన: ఎం.వి.చంద్రశేఖరరావు
నువ్వు వ్రాసే ఒక్క
అక్షరం తేవాలి, లక్ష మెదళ్ళలో కదలిక,
విద్వాన్ సర్వత్రపూజ్యతే
అన్నారు,పెద్దలు,
మనిషి మనీషి కావాలన్నా
దేశం పసిడిపంటలతో శోభిల్లాలన్నా,
ఆనకట్టలు నిలవాలన్నా,
ప్రజలప్రాణలు రక్షింపబడాలన్నా,
ఙ్నానం కావాలీ,
అటువంటి ఙ్నానాన్ని ప్రసాదించేది,అక్షరం!
ఓం,శ్రీం,హ్రీం అన్న బీజాక్షరాలు కాళిదాసుని
మహాకవిని చేసినాయి,
ఓం నమశివాయః,
అఆఇఈ అని నువ్వు
వ్రాసే అక్షరాలు,కావాలీ,
ఈ దేశపు కీర్తిపతాకలు!