ఎందరో మహానుభావులు అందరికి వందనములు
-శ్రీ లక్ష్మి
అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అమ్మ, చదువే మనకు ముఖ్యం అని నాన్న..
చదువుతో పాటు క్రమశిక్షణ , పట్టుదల, వినయ-విధేయతలు, ఎంతో ముఖ్యమని
మనకు నేర్పించేది మన గురువులే.
వీటి విలువలు తెలియకుండానే కష్టపడి నేర్చుకుంటాం.
ఈ కష్టమే మనజీవితాన్ని ఇష్టంగా మారుస్తుందని క్రమంగా తెలుసుకుంటాం.
పిల్లలు చదివి ప్రయోజకులుగా మంచి పౌరులుగా ఎదిగితే,
గర్వంగా భావించేది వారి తల్లి తండ్రుల తరువాత వారి గురువులే
అందుకేనేమో తల్లి , తండ్రి, గురువు అనే వరుసలో భగవంతుడు కూడా నాలుగో స్థానాన్ని ఎంచుకున్నాడు.
మానవుడికి ఈ ముగ్గురి దీవెనలు ఉంటె, ఇంకో నలుగురికి మంచి గురువుగా ఉండగలరు.
జీవితంలో ఎందరో మనకు పాఠాల్ని నేర్పుతారు, వారందరు గురువులే..
ఆ మహానుభావులందరికి శతకోటి వందనాలు.
***
Well done 👍 and very well written Sri
Hattsoff