(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
ఎందుకో అలా అనాలనిపించింది
రచన: గార్లపాటి. పాపారావు
స్వార్ధపు చీకట్లు కమ్ముకున్నపుడు
కంటికి కనిపించేదంతా ఖచ్చితత్వమని
ఎలా అనిపిస్తుంది వాళ్లకు
అని నామనసు నన్ను పదే పదే ప్రశ్నిస్తుంది
ధన వ్యామోహం ఎక్కువై
సంపాదన రంగు కాగితాల మోజు అధికమైయిందని పదే పదే హెచ్చరిస్తుంది
అవినీతి ని ఆశ్రయించాలన్న తపన
ఎక్కువై ఆడంబరాలకు పోయి
నక్క జిత్తుల ఆలోచనలతో
వ్యవస్థ ను పక్కదోవ పట్టించడమే కాకుండా ఎందరో జీవితాల్ని భ్రమలో బ్రతికేటట్టు చేసి ఊకదంపుడు ప్రగల్బాలు పలకడం అలవాటైపోయింది వాళ్లకు
ఇదేనా న్యాయమంటే? ఇదేనా ధర్మమంటే?
నా అంతరంగం నా మనసు పై పదే పదే ప్రశ్నల వర్షం కురిపిస్తుంది
పేరుకే ఖచ్చితత్వము
అది ముమ్మాటికీ నివురుకప్పిన నిప్పే
ఆ స్వార్థపు కుంపటి లొ
నీతి నిజాయితీలు కబాబుల్లా కమురుకుపోతుంటే నిజం అక్కడ నిలుచోగలదా ఇమిడిపోగలదా
ఇదేనెమో స్వార్థంతొ కమ్ముకుపోవడమంటే
సముచిత న్యాయం జరగనప్పుడు
సందర్భం వచ్చిందని మాట్లాడుకొవడం సముచితమేనా అనె సందేహం
నామనసు ను తొలిచి మానని గాయం చేసింది ఇదె అక్కడి న్యాయం
ఇక్కడ రాళ్ళేతే కూలి రాజు కాలేడు
అణగారిన వర్గానికి అధిపతి కాలేడు
బానిస సంకెళ్లు తుంచుకోనూలేడు
కటికి దారిద్య్రాన్ని జయించను లేడు
ఇప్పటికి త్రిశంకుని స్వర్గమే
ఎందుకంటే ఇతను నమ్ముకున్నది
జవాబు లేని ప్రశ్నల బాండాగారాన్ని
కటికి దరిద్రానికి ఆనవాళ్లుగా ఉంచుకున్నాడు గనుక..