(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)
కరోన మాయ రోగం
రచయిత :: పావని చిలువేరు
కరోన మాయ రోగం మారణహోమమాయే
మానవత్వం మంట కలిసే ,
మనుషుల మీద వ్యాపారం మొదలాయే,
ప్రాణ వాయువు కరువై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే
కనికరం లేని బండ హృదయం వ్యాపారం చేస్తుండే
చూడలేని పుడమితల్లి నొప్పులు పడుతోండే.
సాయం చేస్తానన్న ఆపన్న హస్తం యెదుగావున్న
దరిదాపులకి రానివ్వని చీకటి వ్యాపారం లో మానవత్వం కనుమరుగాయే.
ప్రాణం విలువ లెక్కలేక పాయే
కలలు కన్న కళ్లు నేల రాలి పాయే.
చూస్తున్న హృదయం తల్లడిపాయే.
మానవత్వం ముసుగులో జరిగే అక్రమాలు
చూడలేని మానవ ప్రాణం కొన ఊపిరితో కళ్లు తేలేసే .
మందు లేని సూది గుచ్చి,
పైసలకి మంచి మందును అమ్ముతుండే ,
మానవత్వ ముసుగులో జరుగుతున్న అక్రమాలు చూసి
కుటుంబాలు కుటుంబాలు మరుగున పడే.
దగ్గరున్న ఆప్పన్న హస్తం యెగిరి పాయె.
బిక్కమొహం వేయడం ప్రజల వంతాయే.
సొంత బంధం ,ప్రాణ స్నేహo
అంటురోగమై బాధ పడుతుంటే
మానవత్వం కరువయి మనిషి ప్రాణాలతో వ్యాపారం చేస్తుండే
ఆక్సిజన్ లేదంటే హాస్పిటల్ లో బెడ్ దొరకలేదంటే
ఇక ప్రాణాలు గాలిలో కలిసి పోయినట్టె
ప్రైవేట్ ఆసుపత్రిల్లో
మానవత్వం మంటగలిసిందంటే
మనిషితనం మాయమయిందంటే
యెవరికి వద్ధురా ఈ కష్టమని
నాలో నేను రోదిస్తుoటే.
కంటికి నిద్ర రాదాయే కళ్లుకు కలలే బరువాయే.
మానవత్వం యెక్కడా అని యెదురు చూడడం ప్రజల వంతాయే.