(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)
స్వార్ధపరుల చేతిలో
రచయిత :: లోడె రాములు
జీవితం ఎప్పుడూ నిరాశా నిస్పృహల మద్యే గడచిపోతుందేమో అనుకుంటాను.
మానవతా పరిమళాలను అందించే వ్యస్థలన్నింటిలో వ్యాపార ధోరణి..
ఇంతింతై వటుడింతైనట్లు…
ఇందు కలదు అందు లేదని సందేహం వలదన్నట్లు…
అంతటా వేళ్లునుకుంది….
తలక్రిందుల పయనిస్తూ..
అభివృద్ధి..పురోభివృద్ధి అని జబ్బలు చరచుకుంటున్నాం..
నిజానికి మనిషి లొనే స్వార్థం పెరిగి
మానవత్వ ముసుగులో కూడా మనిషిని మనిషే దోచుకోవడమే…
కాకుండా పంచభూతాలతో కూడా పరాచకాలాడుతున్నాడు…
అయినా…
ధర్మం మీద నడిచే మహానుభావులున్నంత వరకు
ఈ చీడపురుగులు..
చితాభస్మం కాకమానరు….