మదిలో మాట
ఒంటరిగా ఉన్నా వెన్నలని చూస్తూ
అక్కడ కూడా ప్రశాంతతా లేదు
ఆ చందమామ మోములో నీ ప్రతిబింబం
ఆ చిరుగాలి నీలా నను తాకి వెళ్తుంది
మనసేమో మౌనంగా ఉంది
మాట ఏమో మాయం అయింది
నాలో నేనే మదన పడుతూ
నీతో చెప్పాలని సంకోచిస్తు
నిను చేరే దారికై అన్వేషిస్తూ
ఒంటరిగా శిలలా కూర్చుంటు
మతి లేని వారిలా
నాలో నేనే మాట్లాడుకుంటూ
నిన్ను చూసే క్షణంకై
నీ తోడు నడిచే వరంకై
అనుక్షణం నిను జపిస్తూ
నా ప్రతిదినమూ నీతో మొదలై
నా చివరి క్షణంలో అయినా
నీతో గడపాలని నా గమ్యనికై
నీ దరికి వస్తున్నాను
రచన:లక్ష్మి అక్షర