అంశం: నేనో వస్తువుని
మనిషిగా మారేదెన్నడో..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: లోడె రాములు
నేటి యాంత్రిక జీవితంలో…నేనో మనిషిని అన్న సంగతే మరిచాను
ఉమ్మడి కుటుంబంలో ఉన్నా..
ఒంటరి జీవితమే అలవాటు చేసుకున్నా..
అందరిలో ఉద్యోగం చేస్తున్నా
ఆట విడుపులకు దూరమయ్యా..
ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరి
బాల్యాన్ని కూడా బంధీగా మార్చేశా
సినిమాలు షికార్లు చేసిన యువ రక్తం
నత్త నడకల మత్తులో ముంచేశా
ఒంటరిగా ప్రయాణిస్తున్న సంసార బండిని
లాగే శక్తిని కూడా చంపుకున్నా..
నవ్వును కోల్పోయిన పెదాలు
నడకను మరచిన కాళ్లు
ప్రేమగా పలకని హృదయం
సేవ చేయని చేతులు..కరుణ చూపని కళ్లు
అన్నీ ఉన్నా అవసరానికి ఎవరికి అక్కరకు రాని మనిషిగా మిగిలాను
నిజమే నేను ఒక వస్తువుని..
నాకు నేనే పనికి రాని పరికరాన్ని
ఈ పరికరానికి ప్రాణం పొసే తల్లి ఎవరో
ఇక మనిషిగా మారే దెన్నాడో…