అంశం: నేనొక వస్తువుని
మనిషి!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎం.వి.చంద్రశేఖరరావు
అవును,నేనొక వస్తువును,
నేనొక మనిషిని,
నాగరికత పెరిగి,
మనసే తరిగి, మనిషే ఈనాడు,
ఒకవస్తువుగా తయారయ్యాడు,
చరాచరజగత్తులో నేనొక మనసులేని బొమ్మను,
తినే బియ్యంలో రాళ్ళుకలుపుతున్నాను,
ప్లాస్టిక్ బియ్యం అమ్ముతున్నాను,
కల్తీతో ఆనకట్టలు, రోడ్లు,
కొట్టుకు పోయేలా చేస్తున్నాను,
నా స్వార్ధం కోసం,
కులమతాలకోసం రక్తం
ఏరులైపారిస్తున్నాను,
ఆడపడుచుల ప్రాణాలు
దోచుకుంటున్నాను,
నాలో మనిషి ఏనాడో
చచ్చిపొయ్యాడు,డబ్బు
కోసం బతుకుతున్న మనిషిని నేను,
నేనొక ప్రాణంలేని వస్తువుని,
కానీ,రేపటిపౌరులలో,నా
పిల్లలున్నారు,వాళ్ళ
భవిష్యత్తు ఏమిటీ?
ఎందుకు నాకు ఈ ఆలోచనరావటం లేదు,
మనసులేని వస్తువులా
ఎందుకు బ్రతుకుతున్నాను!