మట్టి నా శ్వాస
రచన::జి.ఎల్.ఎన్.శాస్త్రి
అమ్మమ్మ చెప్పెది,
మట్టిలో పుట్టాం,
మట్టిలోకలసిపోతామని,
సిద్హాంతాన్ని నమ్ముకున్నంత కాలం
మనిషి హాయిగానే ఉండేవాడు.
నేనే సర్వము అనే
అహం చేరగానే,
ఒక్కో మెట్టు క్రిందకు,
ప్రకృతిని జయించానని విర్రవీగి,
నదులు తవ్వి,.చెట్లు నరికి,
ఆకాశ హ్రర్మ్యాలు కట్టి,
అదే అభివృద్ధి అని హుంకరించి,
శీతల యంత్రాల సుఖంతో
ప్రకృతిని జయించానని,
విర్రవీగిన మనిషి చిన్న జీవికి భయపడి,
పట్టణాన్ని వదిలి పల్లెబాట పట్టి,
అతలా కుతలమై మళ్లీ ప్రకృతి బాట.
భూమాత ఇచ్చిన
భరోసాతోనే,
సజత్వానికి దగ్గరగా..
ప్రకృతి ఇచ్చిన మందుతోనే
ఊపిరి నిలుపుకొంటున్నాడు.
మట్టినుండి వచ్చాం,
మట్టే మనను కాపాడి,
కాలం రాగానే తనలో..
కలిపేసుకుంటుంది.
ఇదే జీవన సత్యం.