మట్టినైపోతాను
రచన :: శ్రీలత. కే
నేను మౌనమైన విషాద గీతికను,
హృదయాగ్నిలో కాలిన బూడిదను.
నేను కరిగిన కన్నీటి ఆనవాలును,
మిగిలిన జ్ఞాపకాల నీడను.
నా విషాద గాథ వినిపించేదేవరికి,
నా హృదయ బాధ కనిపించేదెవరికి
ఏ దేవుని పాదాలను సృశిస్తుంది
ఏ మనిషి హృదయాన్ని కరిగిస్తుంది..
నేనున్నా ఈ లోకంలో ఒంటరిగా…
వెళ్తున్న మోయలేని భారంతో…
మనిషినై వచ్చాను…
మట్టినై పోతాను…
***