ప్రక్రియ :: సున్నితం
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు
రచయిత :: జంపని శ్రీనివాసమూర్తి
సహస్రాబ్దాల ప్రాణాలకు ఆక్సిజన్
శతావధానములు చేయు వృక్షములు.
అవియే సంజీవినీ కార్ఖానాలు.
చూడచక్కని తెలుగు సున్నితంబు.
మెదళ్ళక్షేత్రంలో ఆలోచనలు పెంచేయ్
అవనిలో మొక్కలు నాటాలని,
దేశ కాలుష్యాన్ని నిర్మూలించాలని.
చూడచక్కని తెలుగు సున్నితంబు.
ఆకలితీర్చి సేదతీర్చే వంశవృక్షం.
భోగభాగ్యాలకు దారిచూపే అవనిబంధు
ఆకుపచ్చ చీరకట్టిన వృక్ష”మూర్తి”.
చూడచక్కని తెలుగు సున్నితంబు.
మొక్కలు ఊరంతా నాటవోయ్
రేపు అవి విశ్రాంతికేంద్రాలై,
జాతికి రక్షణాభారం వహిస్తాయి.
చూడచక్కని తెలుగు సున్నితంబు.
కాలుష్యాలకు గొడ్డలిపెట్టు వృక్షాలు.
ఒక్కసారి పెంచిచూడు వివేకివై,
శాఖోపశాఖల పురుళ్ళతో తోడుంటాయి.
చూడచక్కని తెలుగు సున్నితంబు.