ప్రశ్నించు
రచయిత :: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )
ఎప్పుడో శిథిలమైన శాస్త్రాలను అనుసరిస్తున్న
విలువలు లేని మూర్ఖపు ఆలోచనలను…..
ఆధునిక కాలంలోనూ స్వేచ్ఛను ఇవ్వని
మహానుభావుల మేధో సంపత్తిని…..
తరాలు మారినా కాలాలు మారినా
మారని మనుషుల్లోని రాతి మనసులను…..
మార్పు కోరని జనాన్ని మార్పు అంగీకరించలేని సమాజాన్ని
యుగ యుగాలుగా పాతాళంలో దాగిన మంచివాళ్ళ మౌనాన్ని ప్రశ్నించు…..
మీరు రచించే ప్రతి రచన చాలా చక్కగా వుంటుంది kranthi గారు