రామాయణం .. విలువులను నేర్పే గురువు

రామాయణం .. విలువులను నేర్పే గురువు

రచన:: ధన లక్ష్మి

రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?   మాయలు మంత్రాలు చూపించలేదు.
విశ్వరూపం ప్రకటించలేదు.   జీవితంలో ఎన్నో కష్టాలు… జరగరాని సంఘటనలు.. చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు…
  పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు… తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు…  కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు…అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస  వధ చేశాడు…అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు.
లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః – దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు…అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?
     ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ.. ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.
       రామాయణం గురించి ఎందుకు తెలుసుకోవాలి…ఎందుకు చిన్న వయసు నుంచి పిల్లలకీ నేర్పాలి..ఈతరం వాళ్ళు నేర్చుకునే ఎన్నో విలువలు ఉన్నాయి… రామాయణం విలువను చాటి చెప్పే చిన్న కథ….
రైల్వే స్టేషన్ లో  రైలు కోసం జనాలు ఎదురుచూస్తున్నారు…ఒక మధ్య వయసు జంట పిల్లలతో ఒక బెంచ్ దగ్గర కూర్చున్నారు..పక్కన ఒక పెద్ద వయసు జంట కూర్చున్నారు..
  ఆయన ఎదో పుస్తకం చదువుతున్నారు.. ఎక్కడి వరకు వెళ్తున్నారు మాట కలిపాడు మద్యవయసాయన.  విజయవాడ వరకు  వెళుతున్నాం.మీరూ అడిగాడు పెద్ద వయసాయన.
మేమూ విజయవాడ వరకే.రిజర్వేషన్ వుందా అడిగాడు మద్యవయసాయన.
ఆ మా అబ్బాయి చేశాడు.  S5 లో.  చెప్పాడు పెద్దాయన.  అరే మాది కూడా S5.  వాళ్ళ వి ఎదురెదురు సీట్లు అని తెలుసుకున్నారు.ఆ పుస్తకం ఏమిటండీ అడిగాడు మద్యవయసాయన.
  పుస్తకం అట్ట చూపిస్తూ రామాయణం చెప్పాడు  పెద్దాయన. ఇప్పుడూ  ఎంత వరకు చదివారు అడిగాడు మధ్యవయసాయన. సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు.అక్కడ మద్యలో గుహుడు కలిశాడు  అంతవరకు చదివాను…
ఆ అవన్నీ ఈ వయసులో ఇప్పుడు నాకు ఎందుకు లెండి రిటైర్ అయ్యాక తీరిక గా చదువుకుంట అన్నాడు మద్యవయసాయాన.  పెద్దాయన నవ్వి మళ్లీ పుస్తకం చదవటం లో మునిగిపోయాడు.
అక్కడ రైలు  3 నిమిషాలు మాత్రమే ఆగుతుంది.
జనాలు కాస్త ఎక్కువగానే వున్నారు.త్వరగా రైలు ఎక్కేయలి, పిల్లలు, జాగ్రత్త, ఆ లగేజి అంతా ఒకేచోట పెట్టు,అటు ఇటు వెళ్లకండి.  రైలు రాగానే జనాలు తోసుకుని వస్తారు.బొమ్మల్లా కుర్చుకోకుండ వెంటే రండి….భార్య కీ ఆదేశాలు జారీ చేస్తున్నాడు మథ్యవయసాయన.
ఇంతలో వాళ్ళు ఎక్కవలసిన ట్రైన్ వచ్చింది ..లగేజీ తీసుకుని రా రా అలా నిలబడిపోతవెంటి అని
భార్య ను అరుస్తూ ముందుకు కదిలాడు    మద్యవయసాయన .
జనాలని తోసుకుంటూ ముందు ఆయన ఎక్కేసాడు.  వెనకే భార్య పిల్లలు వస్తున్నారు లే అనుకున్నాడు.తీరా ఎక్కి చూశాక భార్య, పిల్లలు కనపడలేదు,లగేజి బెర్త్ మీద పెట్టి, పెద్దాయన కి లగేజి చూస్తుండండి అని చెప్పి వెనక్కి వెళ్ళి డోర్ దగ్గర నిలబడి చూసాడు. ఇంకా అతని భార్య పిల్లలు ఎక్కడం లోనే వున్నారు.అంతలో రైలు కూత పెట్టింది.కసురుకుంటు భార్య చేయిని పట్టుకుని లోపలికి లాగేసాడు. పిల్లలని కూడా లోనికి లాగేసాడు.
  ఇందుకే మిమ్మల్ని బయటికి తీసుకు రాను.లోక జ్ఞానం లేదు, నీకు రైలు ఎక్కడం కూడా రాదా, నా వెంటే ఎక్కు అంటే వినపడద.నిన్ను  కాదు మి నాన్నని అనాలి. నిన్ను నాకు అంటగట్టారు అని గట్టిగా అరుస్తున్నాడు.  రైలు కదిలింది.  కాసేపటికి ఆయన శాంతించాడు.
పెద్దాయన మళ్లీ పుస్తకం చదవటం మొదలు పెట్టాడు. ఏమి అంతా గొప్పతనం ఆ పుస్తకం లో ఉందండి అదే పనిగా చదువుతున్నారు.. ఎప్పుడో జరిగింది, ఎవరో  రాశారు ఇంత టెక్నాలజీ వచ్చింది. ఇంకా ఆ పుస్తకం పట్టుకుని చదువుతున్నారు, అన్నాడు మద్యవయసాయన.
  పెద్దాయన అతని వైపు చూసి చిన్నగా నవ్వి, ఇందాక రైలు ఎక్కేటప్పుడు మీరు ఎంత కంగారు పడ్డారు.  మీ భార్య, పిల్లలు, లగేజీ ని రైలు ఎక్కించటానికి కాస్త కాదు కానీ కొంచం ఎక్కువే  ప్రయాస పడ్డారు.
  నేను, నా భార్య కాస్త ముసలి వాళ్ళం అయిన కూడా మేము హడావిడి లేకుండా రైలు ఎక్కేసాం.
ఫ్లాట్ ఫారం మీద వున్నపుడు మీరు అడిగారు, పుస్తకం ఏమిటి అని.నిజానికి నేను రామాయణం మొదటి సారి  చదువుతున్నాను .సీతా సమేతంగా రామ లక్ష్మణులు అడవికి వెళ్లారు.అక్కడ మద్యలో గుహుడు కలిశాడు అని చెప్పాను…..అవును, గుహుడు పడవలో వాళ్ళను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు చేర్చాడు. అంతేగా అన్నాడు మద్యవయసాయన.   
   ఆ ఆ అంతే కాకపోతే,.ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక మంచి విషయం ఉంది అది ఏంటో తెలుసా??
   ముందుగా పడవని సీతమ్మ ఎక్కింది, తరువాత లక్ష్మణుడు ఎక్కాడు, ఆఖరున రాముడు ఎక్కాడు.
తరువాత పడవ ముందుకు కదిలింది.  ఈ వృత్తాంతం అంతా నేను ఫ్లాట్ ఫారం మీదనే చదివాను…ఈ సంఘటన మనకు ఏమి నేర్పిస్తుం దొ
తెలుసా???
   “ముందు మనల్ని నమ్ముకుని మనతో వచ్చిన వారిని బాగా  చూసుకోవాలి. తరువాత మన గురించి మనం ఆలోచించాలి. అని దాని భావం.”
   అందుకే రైలు ఎక్కేటప్పుడు ముందు నా భార్యని ఎక్కించా, లగేజి తీసుకుని తన వెనక నేను ఎక్కేసా  మనం ఎలా బతకాలి అని ఏ టెక్నాలజీ  మనకి చెప్పదు అన్నాడు పెద్దాయన.
మద్యవయసాయన కి సిగ్గుగ  అనిపించింది. అలా తప్పుగ ప్రవర్తించినందుకు .అతని పిల్లలకి ఆ పెద్దయిన చెప్పిన మాట నచ్చి ..తాతయ్య మనం ఎందుకు అసలు రామాయణం చదవాలి ..ఆ బుక్ గొప్ప తనం ఏంటి అని … 
తప్పకుండా పిల్లలు ఎందుకు చెప్పను చెప్పండి
ఆ పెద్ద అయినా చెప్పడం స్టార్ట్ చేసారు ….
  
శాస్త్ర ధర్మం :-

   తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే

స్నేహ ధర్మం :

మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పుతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు

యుద్ధ ధర్మం :-

   వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు.. వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు. మరణాంతారం వైరాని
 ” నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||”
‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు… ఇదీ రాముడి ధర్మవర్తన

దయా ధర్మం :-

  సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకా రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు… చివరకు రావణుడే తనను ఆశ్రయించినా.. అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు

మనుష్య ధర్మం :-

రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు…’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.
“ఆత్మానం మానుషం మన్యే… దశరథాత్మజః”  అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.
సోదర ధర్మం :-
రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె  ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ.. పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం .

రాజ్య ధర్మం:

   చాకలి వాడు అన్న ఒక మాటికీ …తన ప్రాణం అయినా సీత అమ్మవారిని కూడా వదిలిపెట్టారు …ప్రతి క్షణం సీత అమ్మ ను తలుచుకొని మరి బాధపడేవారు …ఆలా చాకలి వాడు అన్న ఒక మాటకి విలువ ఇచ్చారు …నిజమైన రాజు లక్షణం …తాను బాధ భరిస్తూ కూడా  ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వారు …
  తాతయ్య ..ఆ చాకలి వాడికి రాముడు  పిలిచి చెప్పవచ్చు కదా ….
   ఆ పెద్ద అయినా నవ్వి …. మీరు విజయవాడ వచ్చే వరకే కదా ప్రయాణం చేస్తారు కదా …ప్రతి ఒకరి లైఫ్, ప్రతి బంధం ఏదో ఒక రోజు అంతం కావలసిందే …రాముడు జన్మ ముగియాలంటే …సీత అమ్మ వారు అడివికివి వెళ్లి ..లవ కుశులకు జన్మనిచ్చి వారు వారి నాన్న గారితో  యుద్ధం చేసి …వారి నాన్న అని కనుకొన్ని…వారిని రాముల వారికి అప్పకించి అమ్మ వారు భూమి లోకి వెళ్లి పోవడం …రాములు వారు రాజ్య బాధ్యతలను లవకుశులను  అప్పగించి ..తన జన్మను ముగించారు ….
అలా రామావతారం పుర్తియింది… ఇదంతా జరగాలి అంటే చాకలి వాడు నోరు జారాలి… అప్పుడు కదా కథ ముందుకు వెళ్ళడానికి కుదిరేది…
  మీకు ఒక విషయం తెలుసా …రామ నామం జపించడం వాళ్ళ మనలో  పాజిటివ్ వైబ్స్ వస్తాయి .
ఎలా తాతయ్యా?మనం  చూస్తూ ఉంటాము…పెద్దవాళ్ళు రామ రామ అని అంటు ఉంటారు…
అవును తాతయ్యా స్కూల్లో మా మేడమ్ కూడా అలాగే అంటారు…మా అమ్మమ్మ కూడా అలాగే అంటు ఉంటారు….
ఒకే పిల్లలు రామ రామ అనే దానిని ఇంగ్లీషులో చెప్పండి ….
   ‘RAMA’ అని స్పెల్లింగ్ చెప్పుతారు…
చూడండి పిల్లలు R అనే లెటర్ హిందీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వరస సంఖ్య ఎంత? 25 తాతయ్యా…
Aa అనే లెటర్ వరస సంఖ్య? 2 తాతయ్యా..
M అనే లెటర్ సంఖ్య ఎంత?  27 తాతయ్యా…
మొత్తం కలిపి చెప్పండి అని పిల్లలను అడిగారు…
25+2+27  = 54 తాతయ్యా అనే వేగంగా చెప్పారు ..
54 ను రెండు సార్లు కలపండి…అలాగే తాతయ్యా…
54+54 = 108 తాతయ్యా…
శభాష్! అని పిలల్లను మెచ్చుకున్నారు..
A పిల్లల తండ్రి అయిన మధ్య వయసు  ఆయన గర్వంగా ఫీల్ అవుతారు…
  రామ రామ…అంటే రెండు సార్లు అంటే 108 …అంటే అన్ని సార్లు ప్రదక్షణ చేసినా పుణ్యం వస్తుంది…
అవునా తాతయ్యా.?.అది ఎలా తాతయ్యా?
*సూర్యుడు కి ,చంద్రుడికి మధ్య దూరం 108 రేట్లు..
నాట్య భంగిమలు,దేవ భాషలు కూడా 108 …
*మనకు ఉన్న ముఖ్యమైన శివాలయాలు , విష్ణువు గుళ్ళు కూడా 108 …
*ఓంకారం ,హనుమాన్ చాలీసా,గాయత్రి మంత్రంనీ కూడా 108 సార్లు జపిస్తారు…
₹ రాశి- నక్షత్రాల పరంగా ఒక లాజిక్ ఉంది..మనకు ఉన్న నక్షత్రాల 27,ప్రతి నక్షత్రానికి 4 పాదాలు = 27 *4= 108….ప్రతి మనిషి ఈ 108 నక్షత్ర పాదాలలో ఒకదానిలో పుట్టి ఉంటాడు…
* జపామాలలో పూస‌లుశాస్త్రం ప్ర‌కారం ఒక వ్య‌క్తి ఒక రోజులో అంటే 24 గంట‌ల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటారు.అంటే 12 గంట‌ల్లో 10800 సార్లు శ్వాస తీసుకుంటాడ‌ని లెక్క‌. ఈ లెక్క ప్ర‌కారం మ‌నిషి దేవుడిని త‌ల‌చుకునేట‌ప్పుడు 10800 సార్లు చేయ‌డం క‌ష్టం కాబ‌ట్టి., చివ‌రి రెండు సున్నాలు తీసివేసి 108ను ప్రామాణికంగా ఉంచార‌ని కొంత మంది పెద్ద‌లు చెబుతుంటారు.
 ఇంత విశిష్ట‌త ఉంది 108 సంఖ్యాకి…రామనామ జపం పలక గానే మనకు అంత పుణ్యం లభిస్తుంది…
అందుకే అంటారు శ్రీ రామ నీ నామం ఎంతో మధురం అని…
 ఒక చెట్టు ఒక్క రోజు ఆకాశం వైపు చూసి..నేను రాజ్యని  ఎలాలి అని…అది ఎలా సాధ్యం …అది ఒక చెట్టు కదా…
  కొద్దీ రోజులకు విపరీతమైన వానల వల్ల చెట్టు కూలి పోయింది…ఆ చెట్టు కొమ్మలను కొందరు శ్రామికులు తీసుకొని వెళ్లి పాదరక్షలు తయారు చేశారు..తరువాత ఆ పాదరక్షలను స్వయంగా రాముడు ధరించాడు..
   వనవాసం అయ్యేంత వరకు రానని భరతుకిడి చెప్పారు రాముల వారు…భరతుడు రాముని పాదరక్షలను వినయంగా తీసుకొని వెళ్ళి వాటిని సింహాసనం పై పెట్టీ రాముడు వచ్చే వరకు రాజ్యపాలన చేశారు…అల ఒక చెట్టు కోరిక ను కూడా రాముల వారు తీర్చారు…
 చిన్నప్పటి నుంచే పురాణాలూ చదవాలి అప్పుడే మనకు మంచి ఏదో చెడు ఏదో తెలుస్తుంది …
విజయంలో ఉన్న గొప్పతనం తెలుస్తుంది.. ఓటమి నెర్పే పాఠం అవకతం అవుతుంది..శత్రువులను క్షమించడం అంటే ఏంటో…నిజమైన స్నేహ బంధం అంటే ఏంటో తెలుస్తుంది….రాజ్యపాలన ,అసలైన దయాగుణం ఏంటో  తెలుస్తుంది…
థాంక్స్ తాతయ్య మేము తప్పకుండ చదవడమే కాదు …తప్పకుండ పాటించడానికి ప్రయత్నిస్తాము …మా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పుతాము అని ఆనందంగా చెప్పుతారు…
పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి.. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. రాముడూ అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం.
   మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది. రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం…

          ” శ్రీ రామ్….జై శ్రీ రామ్”..🙏.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!