రచన – కొఠారు నాగ సాయి అనూష
వెన్నెల వెలుగును శిరసున ధరించి
అగ్నిని త్రినేత్రంలోగరళాన్ని కంఠంలో నిలుపుకుని
చల్లని గంగని శిరోజాలలో బంధించి దాచావు
అందుకో మా వందనం
అందరి ప్రయాణం చివరకి
నీ దగ్గరకేనని స్మశనవాటికలో
నివాసం ఏర్పరుచుకున్నావు
అందుకో మా వందనం
తెల్లని శరీర ఛాయతో,తెల్లని పుష్పాలు త్రిపుంద్రలతో
త్రిశూల దారుడుగా లోకాన్ని కాచి
నీ చల్లని కరుణని కురిపిస్తున్నావు
అందుకో మా వందనం
నిన్ను కోరి చేరిన సతికి సగభాగం ఇచ్చి
అర్ధనారీశ్వరుడుగా హిమవంతుని యువరాణిని
కైలసపు మహారాణిగా చేసావు
అందుకో మా వందనం
ఆకలి తీర్చే అన్నపూర్ణ వాకిట ఆదిబిక్షుగా మారి
రాక్షస సంహారం కోసం పార్వతిని మహాకాళిగా మార్చి
నీ చిరునవ్వును(గణేశుని)లోకానికి ప్రథమ పూజ్యునిగా ఇచ్చావు
అందుకో మా వందనం
మాలోని ఊపిరికి ఆయువు నీవుగా మారి
చలనశక్తిని గౌరిని చేసి
మాలో నిరంతరం నిలిపావు
అందుకో మా వందనం
శివయ్య గురించి చాలా చక్కగా చెప్పారు