స్వార్థం
రచన :: సంజన కృతజ్ఞ
రవి, రాము, కిషోర్ అనే ముగ్గురు స్నేహితులు చాలా సన్నిహితంగా ఉండేవారు. అందులో రవి రాముది స్వచ్ఛమైన స్వభావం కలిగి ఉంటే కిషోర్ మాత్రం తన స్వబుద్ధిని బయట పెట్టే వాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి కిషోర్ ఎప్పుడు తన మాటే అన్నట్టు తను చెప్తే వినాలి ,తను చెప్పిందానికి నవ్వాలి ఎదుటి వారి ఫీలింగ్స్ తో పని లేదు అన్నట్టు ప్రవర్తిస్తాడు రవి .రాము ఫ్రెండే కదా అని చూసి చూడనట్టు పోతారు కొద్దికాలానికి వారు విసుగు చెంది కొంచెం దూరం పెడతారు అది తెలుసుకున్న కిషోర్ తన మనస్తత్వానికి సరైనది కాదని డాంబికం గా అలానే ఉండిపోతాడు రాను రాను దూరం పెరుగుతుంది కానీ మనిషిలో పశ్చాత్తాపం రాదు గెలిచినా – ఓడినా తనదే పైచేయి అంటూ ఒంటరిగా ఉండిపోతాడు .స్వార్థం మనిషి కళ్ళను కప్పేస్తుంది
నీతి: ఫ్రెండ్ షిప్ లో స్వార్ధానికి చోటు ఉండకూడదు అలా అని ఈ రోజుల్లో రిలేషన్స్ లో కూడా స్వార్థం పెరిగి ఎవరికి వారు ఒంటరిగా మిగిలిపోతున్నారు
బాగుంది medam, ఒంటరి తనం వల్లే స్వార్థం పెరుగుతుంది.