అంశం: మన్మధ బాణం.
వివేచన
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: రాళ్ళపల్లి నాగమణి
సతీ వియోగమున విరాగి అయిన,
పరమేశ్వరుని, పార్వతిదరి చేర్చినదీ
మన్మధ బాణం.
మనిషి, మనిషిలో ఎన్నో గుణములు,
ఎన్నెన్నో కళలు, ఎంతో మేధస్సులను,
ముందు తరాలకు వారసత్వంగా
అందించేదే మన్మధ బాణం.
అశాశ్వతమైన జీవితాలలో
అద్భుత లక్షణాలను భద్రపరచుటకు,
మర్యునకిచ్చిన మహావరమీ, మన్మధ బాణం
సృష్టిని కొనసాగించుటకే
భగవంతుని సృష్టీ,ఈ మన్మధ బాణం.
మగనికి, మగువకు మధ్య మరులను పెంచి,
తరతరములను ముందుకు నడిపి,
ఇలలో మానవాళి కొనసాగింపే మన్మధ బాణం.
మానవాళికి అందిన ఈ వరమును,
వివేచనతో వినియోగించుంటె మనిషి కర్తవ్యం