పుస్తకం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కార్తీక్ నేతి
రెండు చేతిల్లో నడుమ ఒడిలో ఒదిగిపోయి
మెల్లిగా ఒక్కో పాదం మస్తిష్కంలోకి వెళుతూ,
తన లోకంలోకి తిసుకువెళ్తుంది పుస్తకం,
ప్రతి అక్షరం మాట్లాడడం మొదలు పెడుతుంది,
స్నేహ బంధాన్ని పెనవేసుకుటుంది,
మందులాగా హృదయంలోనికి చేరుకుంటుంది,
కష్టాల వలనో, సమస్యల వలనో,
ఆత్మనూన్యతా వలనో
పేరుకుపోయిన బయన్ని , బాధని, ప్రతికూలతను పోగొడుతుంది,
సంబాషిస్తూ, ప్రేరేపిస్తుంది చెట్టుకు నీరుపోసినట్టుగ్గా,
నిద్రనమై ఉన్న సర్వశక్తిని మేల్కొల్పుతుంది,
పుస్తకం మనిషికి మనోబలాన్ని అందిస్తుంది,
నిర్దిష్టమైన మార్గాన్ని సూచిస్తుంది .