(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)
సిగ్గుచేటు
రచయిత :: యం. సుశీల రమేష్.
మానవత్వాన్ని మరిచి
స్వార్ధాన్ని వ్యాపారంగా మలచి
ఆఖరికి అమ్మతనానికి కూడా
వ్యాపారాన్ని అంటగట్టి
అంతకంతకు కురూపిలాంటి
తన రూపాన్ని మంచితనం
మానవత్వం అనే ముసుగులో
వ్యాపారి గా రూపు దిద్దు కున్నాడు
వీళ్ళు కాదా నిజమైన
దేశద్రోహులు
సహజమైన వాటిని కల్తీ చేసే హక్కు
వీరికి ఎక్కడిది. ఎవరిచ్చారు.
ఏ క్షణం ఆరు తుందో తెలియని ప్రాణ దీపానికి ఎందుకు ఇంత ఆరాటం,
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి.