(అంశం: “ఏడ తానున్నాడో”)
ఆక్రందన
రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు
“ఏడ పోయినావు,
ఎందున్నావు మావ,
ఏడతానున్నాడో,
ఎలా బతకాలో? తెలీదు మావ,
ఇక్కట్ల పాలయి తిని, పిల్లపాపలతోడ,
ఇసుమంత పంట లేక, అల్లాడుతున్నా మావ,
ఏడ ఉన్నావో మావ?
‘పంటలు లేక, పట్నం పోతివి,
‘తిండి గింజలు లేక, కోతకొచ్చిన పంట’ వడగళ్ల పాలై,
‘మొక్కజొన్న కంకులు రాలిపోయి,
పంట చేతికి రాక అల్లాడుతున్నా , పిల్లాపాపలతో మామ, ఏడ తానున్నడో,
‘కడసారి వచ్చిపో మావ, కనులారా చూచి,
నీ పిల్ల పాపల తోడుగా,
నీ ఇల్లాలి తోడుగా,
ఒక్కసారి రా! మామ,
పట్నం వదిలి పల్లెకు, వచ్చేయి,
నీకోసం ఈ పచ్చని పొలాలు,
మన కాడిఎడ్ల జోడీ,
నీకోసం పరితపిస్తున్న నీ కుటుంబం, ఎదురు చూస్తున్నాయి.
ఏడతానున్నాడో ఆడనే క్షేమంగా ఉన్నావా?,
ఈ గాలి మోసుకోచ్చే,
ఆక్రందన నీకు అందేలా
నీ భార్య మంగి ప్రార్థన ,
ఏడ తానున్నాడో
నా సామి, గమ్మున రా!