అలిగితివా సఖీ
రచయిత:చల్లా. సరోజినీ దేవి.
అలిగితివా సఖీ ప్రియా! అంటూ సతిని బ్రతిమాలు కుంటూ సదాశివుడు వెంట నిలువగా, అంబ అలవోకగా చిరునవ్వుతోనే, చిరు కోపం కలగలిపి “నన్నే అర్ధ భాగమని బులిపించి, గంగనేల తల దాల్చితివో చెప్పుము నీల కంధరా!” యని నిలదీసింది. అందుకా సాంబుడు “అయ్యో పిచ్చి పార్వతీ! ఆమె నీకు పోటీ కాదు, సాటి కూడా కాదు. అరువది వేల మర్త్యులకు అమరలోక ప్రాప్తి కోసం భగీరథుడు చేసిన తపం మెచ్చి వచ్చినది గంగ. అద్దాని ధాటిని ఈ భూమండల మందు తట్టుకోగల వేరు శక్తి మరేదీ లేక నన్ను కోరిన భక్తుల కోసం జటా జూటమందు చోటిచ్చితి గంగకు. పరహితార్థమే తప్ప మరో హేతువు లేదు ఇందు. నమ్ము మా ప్రాణ సఖీ ” అని సవివరంబిచ్చే.
“అంతే అయితే సరే. నేను అలుక మానితి సఖా! నా ప్రాణ ప్రియా!” అని నవ్వెను ఆ జగదంబ మల్లెలు కురియగా.