(అంశం:”అపశకునం”)
ఆలోచన విధానం
రచన::కవిత దాస్యం
ఒక ఊరిలో అన్నపూర్ణమ్మ అతని కొడుకు కుమార్ ఉండేవారు .తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో అల్లారుముద్దుగా పెంచుకుంది. అన్నపూర్ణ కు చాదస్తం తోపాటు మూఢనమ్మకాలు ఎక్కువే, ఒక రోజు తను పూజ చేసుకుంటున్న సమయంలో పాలు నైవేద్యంగా పెట్టింది. ఆ పాలు విరిగిపోవడంతో అపశకునంగా భావించి పూజారిని కలిసి తనకు తన కుటుంబానికి ఏం కీడు జరగబోతోంది అని కంగారుగా అడుగుతుంది. అందుకు పూజారి సమాధానంగా యుక్తవయసు వచ్చాక నీ కొడుకు సన్యాసిగా మారు తాడు అని చెప్తాడు. అయ్యో స్వామి అదెలా ఒకానొక కొడుకు కు పెళ్లి పెటాకులు లేకుండా జీవితం అలా ఉండిపోతే ఎలా పరిష్కారం చెప్పండి, అని అడుగగా ఆ పూజారి నీ కొడుకు నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకోకుండా ఉంటే చాలు అని చెప్తాడు. అలాగే అదెంత పని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది.
కొడుకును నీటిలో తన ప్రతిమను చూసుకోకుండా చాలా జాగ్రత్తగా పెంచుతుంది. కొడుకుకి యుక్తవయసు రానే వచ్చింది. వివాహానికి ఎంతమంది అమ్మాయిలను చూసిన ఏదో ఒక వంక చెప్పి తప్పించుకునేవాడు. అన్నపూర్ణమ్మ విసుగెత్తిపోయింది.
ఊర్లో ఉన్న అమ్మాయిలే కాక పక్క ఊరిలో అమ్మాయిలు ఇలా తనకు తెలిసిన ప్రతి వారిని సంబంధం అడిగి, తన కొడుకుకి ఎలాగైనా వివాహం చేయాలి, అనే పట్టుదల తో సంబంధాలు చూడసాగింది.
కానీ కొడుకు పెట్టె వంకతో రాజీ పడలేక పోయింది చివరికి తన కొడుక్కి నచ్చిన అమ్మాయి ఈ భూమండలం మీదే లేదేమో అని గ్రహించింది.
మన గ్రహచారం బాగోలేక పోతే అది మూఢ నమ్మకమై కూర్చుంటుంది. దానికి ఈ కథ ఉదాహరణ.
***