(అంశం:మానవత్వం ముసుగులో వ్యాపారం)
అంతులేని ఆవేదన
రచయిత :: పుల్లూరి సాయిప్రియ
ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలేని ఆయోమయంలో ఉన్న మాములు సమాన్య మానవులము మేము..
అంతులేని ఆవేదన మాలో..
అంతం లేని కరొన బారినుండి ఏలా బయటపడాలో తెలిక అస్తవ్యస్తం అవుతున్న ప్రజలు..
మన కంటికి కనిపించని ఒక చిన్న సూక్ష్మజీవి..ఎప్పుడు, ఏలా, ఎవరిని కటేస్తుందో.. తెలిక క్షణక్షణము మా గుండేల్లో బయాన్ని నింపుతుంది.
ఇన్ని రోజులుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా మాలో కొంచం కూడ దైర్యాన్ని కోల్పోలేదు.. అలాంటిది ఇప్పుడు మాకున్న మనో దైర్యాన్ని, సహనాన్ని కూడ చంపేస్తుంది ఆ భయంకర మహమ్మరి..
పొట్టకూటికోసం భాదపడుతూ.. ఎం చేయలో తోచక ఇంటికి పరిమితమై..ఎన్నో కష్టాలు పడుతూ.. ఎవరికి వారు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు..
చివరికి ప్రకృతి నుండి దొరికే ఆక్సీజన్ ను ఎల్లప్పుడూ అశ్వదించిన మనము..
ఇప్పుడు వైద్యశాలలో ఆ ఆక్సీజన్ దొరకక కొట్టుమిట్టాడుతున్నారు మన ప్రజలు.
చివరికి ఇప్పుడు ఆ ఆక్సీజన్ కూడ సమాజ మానవత్వపు ముసుగులో ఒక వ్యాపారం అయిపోయింది.
అయ్యో భగవంతుడా.. కొంచం కూడ కనికరం లేని ఈ కాలన్ని ఎందుకు సృష్టించావయ్యా..
ఈ మహమ్మరి అంతమొందె దేన్నడో..ప్రపంచం సస్యమలంగా ఉండే దేన్నడో..