అశాశ్వతం

(అంశం:”అమ్మమ్మ చెప్పిన కథలు”)

అశాశ్వతం

రచన: కవితదాస్యం

అమ్మమ్మగారి ఊరు అంటే చాలా ఇష్టం. పల్లెటూరు కావడం, ఎదురుగా రామాలయం గుడి, పెద్ద రావి చెట్టు ఆ చెట్టు మీద వాలే పక్షుల కిలకిల రావాలే మా మేలుకొలుపు అన్నట్టుగా నిద్రలేపేవి. లేచి లేవగానే టీ తెచ్చిన అమ్మమ్మతో గ్లాసు నిండా కావాలి అని మారాం చేసేదాన్ని. ఉయ్యాల బల్ల మీద అన్ని తెప్పించుకొని తింటూ వారి గారాబానికి నా అల్లరి తోడు అన్నట్టు ఉండేదాన్ని. ఎంత అల్లరి చేసినా, విసుగుకోక అతి గారాబం చేస్తూ, అడిగినవన్నీ తన చీర కొంగున ముడి వేసుకున్నా చిల్లర ఇచ్చి కొనుక్కోమని చెప్పేది. అప్పలు చేసి మూలకు ఉన్న గదిలో దాచి కొంచెం కొంచెం గా పెట్టేది. జడలు వేసేది, గుడికి తీసుకు వెళ్ళేది, అక్కడ ప్రసాదం అద్భుతంగా ఉండేది. అమ్మమ్మ తో నా ముచ్చట్లు మా అమ్మమ్మ నాకు చెప్పిన కథ…

విద్యాభ్యాసానికి గురువు దగ్గరికి వెళ్లే రాము. ఒకరోజు హఠాత్తుగా తనకు తెలియకుండానే ఇదేదో బాగుంది అని చూస్తూ, గురువుగారి టీ తాగే కప్పు సాసరు జారవిడుస్తాడు. అది చాలా పురాతనమైంది విలువైంది. ఆందోళనలో పడిపోయాడు. గురువుగారు అక్కడికి వస్తున్నాడని గమనించి, ఆముక్కలను గబగబా వెనుకకు దాచుకొన్నాడు. తన వైపు పరిశీలనగా చూస్తున్నా గురువుగారిని ఇలా అడిగాడు. గురువుగారు మనుషులు ఎందుకు చనిపోవాలి?
అది చాలా సహజం. పుట్టిన ప్రతి ఒకరునిర్ణీత సమయం తర్వాత మరణించక తప్పదు.
ఏదీ శాశ్వతం కాదు. అన్నాడు గురువు. అప్పుడు అతను వెంటనే వెనక దాచిపెట్టిన ముక్కలను చూపిస్తూ, మీ మీ టీ కప్పు కు కూడా నిర్ణీత సమయం దాటిపోయింది అన్నాడు. గురువు నవ్వుతూ అతని చాకచక్యం చూసి మురిసిపోతాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!