చర్చనీయాంశము కాదు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: అద్దంకి లక్ష్మి
మానవుడు ఈ భూమి పైకి ఎలా వచ్చాడు
ఎలా పోతున్నాడో
మేధాసంపన్నులకు కూడా అందుబట్టని
వింత విషయము
భూమ్యాకాశాలు పరిశీలించి
గ్రహాలు పైన నిలిచాడు మానవుడు కానీ
ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ జీవిగా పుడతారో
చనిపోతారో తెలుసుకోలేని రహస్యం మిది
తప్పసంపన్నులకు కూడా అందుబట్టని అతి రహస్యం
భూమిపై పుట్టిన ప్రతి జీవికి హాయిగా ఆనందంగా జీవించాలని ఉంటుంది
ప్రాణాంతకమైన ఎన్నో రోగాలు వచ్చినా
మానవుడు ఆశాజీవి
చాలు బ్రతుకుల్లో అల్లాడుతున్న వారు కొంతమంది
రేపు మా మనవడి పెళ్లి చూసి పోతాను
అంటూ ఆశాభావం వ్యక్త చేసే వాళ్ళు ఉన్నారు
అనేక పరిశోధనలు చేసి
మృత్యువును జయించాలని ఆశ పడతాడు
డాక్టర్లు కూడా అనేక ఆపరేషన్లు చేసి
మందులు వేసి ఆఖరికి చేతులెత్తేస్తారు.
మృత్యు వనేది మన చేతిలో లేదు
ఎప్పుడు ఎవరికి ఎలా కబళిస్తుందో
ఎవరూ ఊహించలేరు, చెప్పలేరు.
చనిపోతామని ముందే తెలిస్తే
అది వరమా శాపమా అంటే
పోతామని తెలియగానే ఆ శాంతితో
అనారోగ్యం పాలవుతా కొందరు.
ఆనందకరమైన జీవితాన్ని
నరకయాతన చేసుకుంటారు
సంసారంలో చుట్టూ ఉన్నవారికి
దుఃఖాన్ని కలుగజేస్తారు
నడివయసులో ప్రమాదంలో ఇరుక్కుని
పోయిన వారికి, మృత్యువు శాపం కదా!
శారీరక బాధ తట్టుకోలేని వారికి చావు
ఒక వరంగానే అనిపిస్తుంది
మృత్యువు అనే అంశం గురించి ఎక్కువగా
విశ్లేషణ చేయటం
వలన ఉపయోగం ఉండదు
ఈ టాపిక్కుని వదిలేసి హాయిగా ఆనందంగా
కవితలు రాసుకోవడం ఉత్తమమైన మార్గము