అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో
గమ్యం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: బోర భారతీదేవి
రెక్కలొచ్చిన పక్షులవలె
పరవశించి విహరించే
గువ్వలమై
గుండె గూటిలో
నింగినేల సాక్షిగా చేసుకున్న బాసలెన్నో
మనసులో ముడి వేసుకున్న
జ్ఞాపకాల ముద్ర లెన్నో
మిగిలిపోయే నేడు
కనుమరుగైపోయే నా తోడు
ఏమని వర్ణించేది నా గోడు
జ్ఞాపకాల నిశీధిలో గమ్యాన్ని వెతుకుతున్నా
నిశ్శబ్దం రాజ్యమేలేే ఎద సంద్రాన
కానరాని గతకాలపు వైభవాన్ని వెతుకుతున్నా
ఆశల వలయంలో ఊహలే మిగిల్చింది
ఒంటరిని చేసి గుట్టుగా పోయింది.