అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ!?
ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఓయుద్ధం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: దాకరపు బాబూరావు
ఎన్నికల బరిలో మనిషి ఓటు ఆయుధాన్ని పోగొట్టుకున్నచోటప్రజాస్వామ్య పతంగు స్వార్ధ కొమ్మలకే చిక్కుతుంది.
ప్రజాకాంక్షను మరచినస్వలాభాపేక్షఉక్కుపాదాన్ని మోపుతున్న చోట.
గుప్పిట్లో బతుకు పిట్టలు రోజుల రెక్కల్నిఅల్లాడించటం మినహా మరేం చేయలేవు.
ప్రశ్నించటం ఇప్పుడు దేశ ద్రోహ నేరమయ్యాక
మాటల వేర్లమీద ఆంక్షల కత్తులు కవాతులు చేయటంసర్వసాధారణం.
చట్టాల నురిపిళ్ళు చేయటం ఇప్పుడు అందరం చెప్పుకుంటున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు పర్యాయ పదాలు
రక్షక్ వాహనాల పహారాలుపకడ్బందీగాకాస్తుండ గానే.
పోతున్నమహిళల మాన ప్రాణాల వైనాన్నిమళ్ళీ మళ్ళీ లైవ్ టెలికాస్ట్ చేయటమే ఇప్పుడు మనమంతా తాత్పర్యమిచ్చుకుంటున్న రక్షణ.
బ్రతుకుఅభద్రతాభావపుచీకట్లను వెలిగించుకుంటున్న అంధకారంలో మునిగితేలుతుంటే .
మెరిసిపోతున్న భారతమంటూ ప్రకటనల్లో వెలిగిపోయే దేశమే స్వేచ్ఛకు నిదర్శనం.
ప్రపంచ బ్యాంకు అప్పుల పద్దుల్నితెలియకుండానేఅవలీలగామోస్తున్నసామాన్యుల బతుకుల చిట్టానే
ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్య్రం అంటే.
బతకటానికి సామాన్యుడు నిత్యం చేస్తున్న ఆకలి యుద్ధమే ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే.