(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
నాడు నేడు
రచన: సావిత్రి కోవూరు
మెదడుకు మెదడును మార్చి, గుండెకు గుండెను మార్చి, సృష్టికే ప్రతి సృష్టి చేస్తూ, చంద్ర మండలానికి వెళ్ళీ వస్తూ మహనీయుడననుకుంటాడు
నీతిని, న్యాయాన్ని నమ్ముకొని నిశ్చింతగా నిద్రించే వాడానాడు,
అవినీతిలో కూరుకు పోయి, అందలం ఎక్కి తరతరాలకు తరగని ఆస్తిని చేర్చి, నిద్రలేని రాత్రులే గతి ఈనాడు.
అక్క, అన్న, పిన్ని, బాబాయ్, చిన్ని, కాక అని పిలుపులతో ఆప్యాయంగా పలకరించేవారు ఆనాడు
ఎవరెదురైనా సెల్లు చూస్తూ తప్పించుకునే వారే ఎక్కువ ఈనాడు
తోటి మనిషికి గాయమైతే నలుగురు కలిసి నయం చేసేవారు ఆనాడు
నడిరోడ్డులో మనిషిని నరుకుతున్నా విడ్డూరంగా చూస్తూ, వీడియోలు తీసే వారే ఎక్కువ ఈనాడు
ఒకరికి ఆపద వస్తే, అందరు కలిసి గట్టెక్కించే వారు ఆనాడు
పక్కింట్లో హత్య జరుగుతున్నా, తలుపులు బిగించుకుని టీవీ చూస్తు కూర్చునె వాళ్లు ఎక్కువ ఈనాడు
పెళ్లిళ్లకు, పేరంటాలకు పది రోజులు ముందు వచ్చి సాయం చేస్తు ఆనందంలో పాలుపంచుకునే వారానాడు
ముహూర్తం టైం కు వచ్చి, తాళి కట్టగనే అక్షింతలు వేసి, వెళ్ళే వాళ్లే ఎక్కువ ఈనాడు
ప్రేమానురాగాలు, ఆప్యాయత అనుబంధాలు కనుమరుగై, స్వార్థం పెరిగి, యంత్రాలలో యంత్రమై మరమనిషైపోతున్నాడు
మనిషి మనిషికి బంధం పోయి, మందలోనున్నా ఏకాకులమౌతున్నామా? అని నా అంతరంగం ప్రశ్నిస్తుంది.