అంశం: ప్రేమలేఖ
నీ కోసం పరితపిస్తూ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు
“నా ఈ ‘ప్రేమ లేఖ’ నీ కోసం పరితపిస్తూ, యోజనాల దూరాన ‘జమ్ము కాశ్మీరం ‘లో దేశం మీద ప్రేమతో, నన్ను, నీ పిల్లల్ని వదిలి, వెళ్ళిపోతావా ప్రియతమా!! నువ్వు ఎన్నడు వస్తావని, నీ వంశాంకురం ప్రశ్నిస్తుంటే కన్నీటి ధార లే మౌన సమాధానం, నా వంతు, రాత్రి పగలు దేశం కోసం, సరిహద్దు రక్షణకు , మన దేశ ప్రజల సౌభాగ్యం కొరకు, నీ తాపత్రయం ఎంతో శ్లాఘనీయం,కానీ ఒక్కసారి వచ్చి పో మామ!”నా ప్రేమ ఎంత ఘాటు అయినదో రుచి చూసి పో మావ! నీ పిల్లల ప్రేమమృతాన్ని చవిచూడు మావ, నీ తల్లి దండ్రుల అక్క, చెల్లెల ఆప్యాయతను ఆస్వాదించు మామ!,
ఈ నా ప్రేమ లేఖ” నీకు శ్రీరామరక్ష ఓ సైనికుడా!!
అన్న భార్య ‘ప్రేమలేఖ ‘ చదువుతూ, కన్నుల నీరు నిండుతున్న క్షణంలో,”పుల్వామా జిల్లాలో” తెల్లవారు జామున, తీవ్రవాదుల బాంబు దాడిలో, ఆహుతి అయిపోతూ, ప్రియమైన భార్య రాసిన ప్రేమ లేఖ చదువుతూ, కన్నుమూసిన ఓ వీర సైనికుడా నీకివే వేవేల జోహార్లు.
జై హింద్!!.