నీ పేరే జపమై
రచన: పద్మజ రామకృష్ణ.పి
ఢంఢం లాడుతూ చేరాయి
పాత్రలు పెరటి చెంత
తళతళ మంటూ మెరిసాయి
గిన్నెలు పనితల్లి చేతిలో
దాహమై ఆర్వో వాటర్ కింద పెట్టాను
గ్లాసును, జరజరా మని నిండింది
ఆ లోహపు పాత్ర, గొంతులో జారడానికై
ఆత్రంగా గొంతులో పోసిన నీళ్లకు
బురబురా మని వచ్చింది నోటివెంట
నురగ. ఏంటో చూడమా నరసమ్మా, అనీ
అనగానే వచ్చింది మా పనితల్లి నరసమ్మ.
ఒలమ్మో ఉందిగా గలాసు నిండా సబ్బు
ఈ ఒక్కమాలి సూసుకోలేదమ్మా
అని భయని నటిస్తూ. గుమ్మం దాటిదటకనే
ఫక్కున నవ్వింది. మా నరసమ్మ
జారింది బురదగా, చూసి తుడువమ్మా
నీటుగా గచ్చు అంటే. అయ్యయ్యో, నే
సూడలేదమ్మా..! అని, నేను జారినందుకేమో
పవిట చాటు మోము దాచుకుని
నవ్వుకుంటూ వెళ్ళిపోయింది
నోటిలో నురగో.. ఇంటిలో బురదో
తాను రాకపోతే వంటింట్లో వరదే
అందుకే ప్రతినిత్యం మెచ్చుకుంటూ
పలుకుతుంటా నరసమ్మ పేరే జపమై.