(అంశం :: “విమర్శించుట తగునా”)
నీలి తోడేళ్ళు
రచన::చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)
స్వార్థపు ముసుగేసుకొని
లోన కుళ్ళు నింపుకున్న
మనసులు వ్యవస్థని
శాసిస్తున్నాయి…..
అధికార పీఠాలపై
అహంకారం రాజదర్పంతో
చేతులు కాలకుండా
ఆకులు పట్టుకొని
శాసనాలు చేస్తూ ఉంటే
విమర్శించక మేథావి మౌనం వహిస్తే
తగుదనమ్మా అంటూ
నిజాయితీ రంగు పులుముకున్న
నీలి తోడేళ్ళు నమిలేస్తాయి సుమా…!