నివాళి
రచన: పద్మజ రామకృష్ణ.పి
సరిగమల పూల తోటలో సుస్వర రాగాలు పలికించి
ప్రతి అక్షరాన్ని పూల పల్లకిలో
మోసిన మహానుభావా.బాలు
మీరు పరచిన పదాల మాలికలు
మీ జాడ దొరకక..కన్నీరుతో తడిచిపోతున్నాయి..
మీ చెంత ఆలపించిన ఎన్నో కొత్త గాత్రాలను. ఒక్కొక్కటిగా పుష్పాలుగా మలచి. వాటికి మీరే ఆధారంగా దారమై నిలిచి విడిపోని మాలగా గుచ్చారు..
మీరు గుచ్చిన పూల మాలలు
భగవంతుడి మెడలో హారంగా చేరి మెరుస్తు పాటలుగా మురుస్తున్నాయి..
మీరు మాత్రం.అంతర్యామి ఆలసితి సొలసితి అంటూ
భువి నుండి దివికేగారు..
ఏడాది గడిచినా.
మా బాలూ ఎక్కడంటూ ప్రతి అక్షరం అశ్రు బిందువులుగా మారి రోదిస్తూనే ఉన్నాయి.
మరల పుట్టేన ఇలాంటి అక్షర మాంత్రికుడు.ఇక లేరేమో మన అక్షరాలను పూజించే గాన గంధర్వులు అని. అక్షరాలు సైతం ఆర్తిగా వేదన పడుతూనే ఉన్నాయి…
మన.SP బాలు గారికి నివాళి
***************************