ఓ…తండ్రి తీర్పు (లఘు చిత్రం)
డా. చిటికెన కిరణ్ కుమార్ (కథారచయిత)
తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ రచించిన కథ “ఓ… తండ్రి తీర్పు” – లఘు చిత్రం, “శ్రీ రామ దూత ఫిల్మ్ మేకర్స్” ద్వారా రూపుదిద్దు కొని త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది.
కథా రచయిత నిర్మాత దర్శకులు
ఈ చిత్రానికి ఎక్స్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్, ఐదు నంది అవార్డులతో పాటు ప్రముఖ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న “గాధంశెట్టి ఉమామహేశ్వరరావు”, హైదరాబాద్ వారు దర్శకత్వం వహించగా “మాటలు గోవిందరాజులనాగేశ్వరరావు“, “నిర్మాత చిట్టా రాజేశ్వరరావు”లు సమకూర్చారు.
నటీనటులు షూటింగ్ క్లిప్స్
ఈ సందర్భంగా “కథా రచయిత చిటికెన కిరణ్ కుమార్” గారు మాట్లాడుతూ సమాజంలో అంతరించిపోతున్న మానవీయ విలువలు, సాంకేతికపరంగా యువత ఎదిగినప్పటికీ కొన్ని కుటుంబాల్లో జరుగుతున్న అనర్ధాలను ఆధారితంగా చేసుకొని మార్పు దిశగా ఒక సందేశాత్మక కథను రచించానని తెలియజేశారు.
పలువురు ప్రముఖులు, కవులు, రచయితలు – డా.చిటికెనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
“తపస్వి మనోహరం టీమ్” తరపున చిటికెన కిరణ్ కుమార్ గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాము.