వెలుగు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పుష్పాంజలి
రాత్రి 7గంటలు సమయం కావస్తున్నది. మానాన్న భోజనానికి వచ్చి కూర్చున్నారు. ఆయన రాత్రిపూట అన్నం మానేసి చాలారోజులైంది. ఒక 2చపాతీలు మాత్రమే తింటున్నారు.
అమ్మ చపాతీ పెట్టి, పళ్లెంలో కూర వేస్తోంది. నాన్నతో ఏదో మాట్లాడుతూ ఆ పళ్లెం వైపు చూసాను నేను, చపాతీ కాస్త మాడింది. నాన్న తినేదే రెండు చపాతీలు అది కాస్తా మాడింది. మా నాన్నగారు అమ్మనేమంటారోనని భయపడ్డాను. కానీ, ఆయన ఏమీ అనకుండా నాకు కబుర్లు చెబుతూ ఆ చపాతీ తినేశారు.
నాన్నగారు చేతులు కడుక్కునేటప్పుడు అమ్మఅంది. ఏంటో ఇవాళ మంట ఎక్కువ పెట్టినట్టున్నాను. రొట్టెలు మాడిపోయింది. మళ్లీ చేయబోయేలోపు మీరు భోజనానికి వచ్చేశారు. అందుకే అదే వడ్డించాను. అలా బాగా కాలిన చపాతీ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వే ఎప్పుడూ పెట్టావు’’ అంటూ నాన్న నవ్వుతూ బదులిచ్చారు. నాకేమీ అర్థం కాలేదు. నాన్నగారు ఇవతలికి వచ్చాక అడిగాను, చపాతీ నల్లగా అయిపోయింది కదా నాన్నా ,
మీకు నిజంగానే అలాంటిది ఇష్టమా’ అని.
ఆయన నన్ను ఒడిలోకి తీసుకుని ఏమన్నారో తెలుసా! ‘‘ఇంటిపనులతో మీ అమ్మ రోజంతా తీరిక లేకుండా కష్టపడుతూ ఉంటుంది. ఆ హడావుడిలో చపాతీ మాడింది. ఈ పూటకి దాన్ని తినడం వల్ల నాకు పెద్ద ఇబ్బందేమీ ఉండదు. అదే అమ్మను కోప్పడితే, ఆ బాధ తనకెప్పటికీ ఉంటుంది కదా.
అయినా, అవతలి మనిషిలో తప్పులెంచడం మొదలుపెడితే ఏ బంధాలూ నిలబడవు
అప్పుడు అది ఏంటో అర్దం కాలేదు కానీ ఇప్పుడు అర్దమైయింది ఎదుటి మనిషి కష్టం గుర్తించి సర్దకునిపోవడం నిజమైన ప్రేమ అదే జీవితంనకు వెలుగునిస్తుంది అని అర్థమైంది నాకు