భారతదేశ గొప్పతనం(పాట సమీక్ష)

భారతదేశ గొప్పతనం(పాట సమీక్ష)

రచన: అలేఖ్య

పాట – జగతి సిగలో జాబిలమ్మకు వందనం
రచన – వేటూరి గారు
గానం – కీరవాణి,సుజాతగార్లు
సంగీతం – కీరవాణి గారు
సందర్భం – మన భారత దేశం యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతి సంప్రదాయాలను, అద్భుతమైన కట్టడాలు, నిర్మానాల గురించి తన మనసులోని భావాలను పాట ద్వారా తన మిత్రులకు కథానాయిక పాట ద్వారా తెలియజేయడం. ఈ చిత్రంలో ఓ విదేశీ వనిత మన దేశానికి వచ్చి మన దేశ గొప్పతనం తెలుసుకుని చాలా అందంగా గొప్పగా వర్ణించింది.

సమీక్ష

జగతి సిగలో జాబిలమ్మకు వందనం అంటూ భారతమాతకి తన వందనాలు తెలుపుతూ మొదలెడుతుంది కథానాయిక..
మమతలు, విలువలతో కూడిన భారత దేశ ఔనత్యం వివరిస్తూ ఐ లవ్ ఇండియా అంటూ భరతమాత పై తనకున్న ప్రేమను తెలియజేస్తుంది.
గంగ యమునల సంగమం, కూచిపూడి నాట్యం యొక్క ప్రావీణ్యం.
అజంత, ఖజురహోలా సోయగాల సంపదకు పురటిగడ్డైన భారతదేశానికి అభివందనం అంటూ పొగడుతుంది కథానాయిక..
కృష్ణవేణి యొక్క నాట్యం, తాజ్ ప్రేమ సౌధం యొక్క విశిష్టత, అన్ని మతాలకు పుట్టినిల్లు.. ఐకమత్యముతో విరాజిల్లుతున్న భారత మాతకి వేవేల వందనాలంటూ చక్కగా వర్ణించారు…
విదేశీయులు సైతం మన సంస్కృతి, విలువలను ఆచరిస్తూ అభినందిస్తున్నారంటే అదే మన ఇండియా గొప్పతనం కదా..
వేటూరి గారి సాహిత్యం అమోఘం. కీరవాణి గారి సంగీతంలో రూపుదిద్దుకున్న ఈ అందమైన పాట మనసుకు హత్తుకునేలా ఉంటుంది..
పుణ్యభూమి నా దేశం నమోనమామి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!