ఎవరు గొప్ప
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన:శనగపల్లిఉమామహేశ్వరరావు
పూరీరికా అనే ఓచిన్న రాజ్యం ఉంది. ఆరాజ్యంలో తపస్సు చేసుకునే ఋషులు ఎందరో వున్నారు. ఆరాజ్యంలో శాంతి, దయ ధర్మం, న్యాయం నాలుగు పాదాల విరాజిల్లుతోంది. రాజు విక్రమసింహుడు గొప్ప ప్రతాపవంతుడు, వినయశీలి. ఆరాజ్యంలో క్రోధాదిత్య అనే ఓఋషి చాలాకాలంగా తపస్సు చేసుకుని గొప్ప గొప్ప సిద్ధులు పొందాడు. కానీ చాలా కోపిష్టి. అదే రాజ్యంలో వినయేంద్రుడు అనే ఋషికూడా గొప్పగా సిద్ధులు పొంది ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నాడు. ఇదిలావుండగా ఒకరోజు ఋషులందరిలో ఎవరుగొప్ప అనే విషయంపై చర్చ జరిగింది. ఎవరికి వారు తామే గొప్ప అని చెప్పుకో సాగారు. క్రోధాదిత్య కోపంతో విర్రవీగుతూ అమాటకొస్తే సమస్త విశ్వంలోనే నాకంటే గొప్పవాడు లేడని అందరి ముందూ దబాయించాడు. ఆసమయంలో వారంతా ఓ చెట్టుక్రింద పెద్ద విశాలమైన అరుగుపై కూర్చుని వున్నారు. అదే సమయంలో చెట్టు పైనుండి ఓ చిలుక రెట్ట వేసింది. అది సరాసరి క్రోధాదిత్య ఋషి నెత్తిపైన పడింది. ఉగ్రరూపంతో ఆ చిలుక వంక కళ్లెర్రజేసి చూసాడు క్రోధాదిత్య ఒక్కసారిగా రెక్కలు టపాటప కొట్టుకుంటూ చిలుక క్రిందపడిపోయి ఓ ఋషీశ్వరా. ఋషికీ కామ క్రోధ లోభమదమత్సర్యములు ఉండరాదు. నీవేమో ఋషీశ్వరులలో గొప్పవాడవని ప్రగల్భాలు పోతున్నావు. అని పలికి మాయమైపోయింది చిలుక. ఆనాటినుండి క్రోధాదిత్య కోపాన్ని విడిచి, గొప్ప ఋషిగా పెరు పొంద సాగెను.