గురువు
రచన: చెరుకు శైలజ
గురువు మార్గం చూపేవాడు
మార్గ దర్శకుడు.
తన జ్ఞానాన్ని అంతా ధారపోసి
విద్యార్థులను వివేకులుగా మార్చేవాడు.
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు
రేపటి భావి పౌరులుగా
ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దేవాడు.
నిరంతా విద్యార్థి నేర్చుకుంటునే ఉంటాడు
అలుపు లేకుండా అభ్యసించేవాడు
తల్లిదండ్రులు జన్మను ఇస్తే
గురువు జీవితాన్నే ఇచ్చేవాడు
.అందుకే అన్నారు పెద్దలు
ఆచార్య దేవోభవ అని ఆలకించారు
అలాంటి గురువును
మన జీవన మార్గాన్ని
రేపటి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది
గురుపూజ చేద్దాం
గురువును ఆజన్మాంతం గుర్తుపెట్టు
కొని గుండెలో పెట్టుకుందాం.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మహానుభావుని తల్చుకుందాం. ప్రపంచంలో గురువును మించిన వారు ఎవరూ లేరు అని చాటి చెప్పుదాం.
ఉపాధ్యాయుల అమూల్యమైన సేవలను గుర్తిందాం