(అంశం – మానవత్వం ముసుగులో వ్యాపారం)
హత విధీ
రచయిత: మంగు కృష్ణకుమారి
పేరుకి మానవత్వం చేసేదంతా వ్యాపారం
ఏనాడు మొదలయింది? ఎప్పుడు ఆరంభం అయింది? ఎవరికయినా
గురుతుందా? అమ్మమ్మలూ
నాన్నమ్మలూ చెప్పేవారే? యుద్ధం సమయంలో, బియ్యం పాలు సరకులూ
అన్నీ బ్లాక్ ట. అదీ అతి కష్టం మీద దొరికేవిట! బెంగాల్ లో వచ్చిన
కృత్రిమ కొరత ప్రపంచంలోనే
పెద్ద వార్త అయిందిట.
మానవత్వం పేరే లేదుట.
ఆగిందా ఈ దోపిడీ? లేదే!
స్వతంత్రం వచ్చేసరికి మరి కాస్త ఎక్కువయింది. వరదలు ముంపులు
తుఫాన్లు ఏవొచ్చినా సామాన్యుల
ఇక్కట్లు పెరిగీవి! మంత్రుల బేంక్
ఎకౌంటులు నిండీవి! ఏది మానవత్వం?
పడుతూ లేస్తూ కడుపూ కాలూ కట్టుకొని పిల్లల కోసం రెక్కాడించే
దీనుల పేరుతో పథకాలు ప్రారంభం ఫలితం తీసుకున్నది బడా బాబులే
రైతు ఋణ మాఫీ పథకంలో మాఫీ
పొందినదంతా ఫాల్స్ బ్రోకర్సేనంట, కావాలంటే పల్లెలో ఆరా తియ్యవచ్చంట!
అయ్యో, కరోనా నువ్వు క్రిమివా? యుద్ధాణువువా? నీ పేరుతో జరుగుతున్న
అరాచకాలు తెలుసా? ప్రాణవాయువు
కోసం పరుగులు, మూడు వేలమందు సీసా ముఫై వేలకి అమ్మేరట!
అవీ దొరక్క చాలామంది మృత్యువు పాలయేరట! ఇల్లు కుదువ పెట్టి
అమ్మనీ నాన్ననీ అంబులెన్స్ లొ
మంచి వైద్యానికి పంపే పిల్లల పాలిటి శాపం సరిహద్దు వివాదం!
రాజకీయమా? నీకు మానవత్వం అంటే తెలీదా? రాక్షస నవ్వులు, వికటాట్టహాసాలు! ‘మా లాభాలు వదులుకు నీకు సేవచేయాలా? దేనికి? నీ బంగారం ఇల్లు అమ్ముకో!
పొలం కుదవ పెట్టు. ఇంకా లేని వాళ్ళందరూ చావండి! మీరు
ఇంటా, బయటా నిరుపయోగం’
అంటూ దుష్ట కంఠ స్వరాలు!
మానవత్వం ముసుగులో శవ వ్యాపారం చేసే కసాయిల్లారా? కసాయి సిగ్గుపడేలా ఉన్నారే మీరంతా? మీకు అవసరం
వచ్చే రోజొస్తుంది. ఆ రోజు బుద్ధి వస్తే
మాత్రం ‘మీవాళ్ళన్న వాళ్ళని’ మీరు
మిగుల్చుకోగలరా?