కవితా సంకలనం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన:రాయప్రోలు
సమీక్షకులు :యాంబాకం
కవి -జనం బతుకుల్లో సంతోషం పల్లవింపచెయ్యటానికి తన కలం చిందుల్ని కుమ్మరించాడు. సమస్య ఎదురైనప్పుడు ప్రజాపక్షం వహించారు. జాతీయ అంతర్జాతీయ విపత్కర పరిస్థితులు సామాన్యున్ని నంజుకుతింటోన్న కాలంలో దుష్టశక్తుల కలాన్ని కత్తిగా కనిపించింది. కవి మనుగడకే ముప్పు వాటిల్లిన సందర్భల్లోనూ తనను మరచి ప్రజాపక్షం వహించాడు. ఇలాంటి ఘటనల మధ్య కవులు వెన్నంటి ప్రబోధించిన జన శ్రేణులను ఉత్సాహంతో ఏగిసిపడేలా చేయగల సత్తా ఒక కవిత్వనికే ఉంది. సంస్కారం సంఘాభిమాని స్వార్థరహిత జీవనుడు అయిన వీరేశలింగం పంతులు, గిడుగు రామమూర్తి పండితులూ గురజాడ అప్పారావు అప్పటిలో కవితలను రచనలో భావనలో ఉండేలా కవిత్వం రచించేవారు.
” జన్నభూమి”
ఏ దేశమేగినా ఎందు కాలిడిన
ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపర నీ జాతి నిండు గౌరవము!
ఈ కవితను వింటున్న పాడుతున్నా మనసులో భావాలు చిలుకుతాయి. ఈ కవిత్వం రచించిన “రాయప్రోలు”గారు చిరంజీవిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఇలాంటి కవితలను “కవితల సంపుటి”అని “వైతాళికులు”అన్న కవితల సంపుటి జనహిత ఎంపిక చేసిన పుస్తకం”.