మహాత్ముడు
రచన – సుశీల రమేష్.M
ఆడది అర్ధరాత్రి నిర్భయంగా
తిరిగిన నాడు స్వాతంత్రం
వచ్చినట్టు అన్న మహాత్ముని
మాటకు తూట్లు పొడిచారు.
నేడు పట్టపగలు కూడా భద్రత
లేకుండాపోయింది పడతికి.
సత్యము అహింస మార్గాన్ని
చూపిన బాపు అడుగుజాడలలో
నడవడం మానేశారు.
కుల మతాలన్నీ ఒకటే అని
చాటిచెప్పిన మహాత్ముడు గాంధీ.
కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి
నూలు వడికి, మురికివాడలు
శుభ్రం చేసిన మహనీయుడు.
ప్రతి ఒక్కరూ శ్రమించాలని ,ఉన్నదే
నలుగురు పంచుకోవాలని
పంతులుగా ,వంటవాడిగా
పాకి వాడిగా సహజీవన
విధానంలో నీ సీదా సాదా
జీవనం గురించి చాటి చెప్పిన
మహోన్నత వ్యక్తి మన జాతిపిత
మహాత్మా గాంధీ గారు.