ప్రకృతి విద్య
రచన : నారుమంచి వాణి ప్రభాకరి
మనిషి అన్ని విద్యలు ప్రకృతి నుంచి నేర్చి ఉన్నతునిగా మారీ
జీవన ప్రగతికి శ్రీ కారం చుట్టి
ఉన్నతమైన వ్యక్తిత్వం నేర్చి
పక్షినుంచి చెట్టు నుంచి గాలి
నీరు ఆకాశం భూమి నుంచి
ఎన్నో ఎన్నెన్నో విద్యలు నేర్చు కొని
స్వార్థ రహిత జీవితం అలవర్చుకోవాలని ఎంతో
ప్రయత్నం చేసి ,కానీ మాటల్లో
మాత్రం ఉన్నతునిగ మిగిలి
సదా అందరికీ సలహాలు సూచనలు ఇస్తు అలుపనేది ఎరగనట్లుగ భావితరాల వ్యక్తుల్ని తీర్చి దిద్దా లనే
ప్రయత్నం చేస్తూ జీవితం గడిపేస్తూ అప్పడు అలా
ఎప్పుడు ఇలా కాలం మారిందా
మనుషుల స్వభావం మారిందా
విశ్లేషించి చెప్పండి…!