మానవాళికి రుధిర సంకేతం

మానవాళికి రుధిర సంకేతం

రచన: డి.స్రవంతి

పుడమితల్లి నిలువెల్లా దహించి పోతోంది..
బడబాగ్నులా జ్వాలలో
మసీ బారిపోతుంది..
పారిశ్రామికరణతో నేడు ఉద్గారాలు ధరణి పొరలను చీల్చినే…
అరణ్యాలలో కార్చిచ్చులు అవనిని ఆవహించెనే…

మంచుకొండలు మైనపు ముద్దులా కరిగెనే..

పెను ప్రమాదం ఉప్పెనలా ముంచుకొచ్చేనే..

మానవాళికి ఇది….రుధిర సంకేతం..
కనువిప్పు కలగాలి.. నాంది పలకాలి..
ప్రతి వ్యక్తి కావాలి ప్రకృతి పరిరక్షకుడు..

ప్రకృతి , పచ్చదనమే జవం,జీవం

పచ్చదనం విరాజిల్లిన నాడు పుడమి తల్లి మానవాళి మనుగడకు భరోసా ఇచ్చును..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!