(అంశం – మానవత్వం ముసుగులో వ్యాపారం)
మాయా ప్రపంచం
రచయిత:: క్రాంతి కుమార్ ( ఇత్నార్క్ )
నిజం అనే అద్దంలో
అబద్ధాన్ని అందంగా ముస్తాబు చేస్తూ…
సేవ అనే పిలుపుతో
ప్రజలను నిలువునా దోచేస్తున్నారు…
మంచితనం అనే నావలో
మోసాన్ని తీరం దాటించేస్తూ…
దయ కరుణ అనే తెరపైన
నకిలీ మనుషులు నట విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు…
ధర్మం అనే పోరాటంలో
మాయా డబ్బుల అండతో అన్యాయాన్ని గెలిపిస్తూ…
మానవత్వం ముసుగులో
జీవిత విలువల వ్యాపారం చేస్తున్నారు…